ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vijayawada: సీఆర్డీయే కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2023-01-23T12:21:46+05:30

విజయవాడ: దళిత జేఏసీ అమరావతి (Dalit JAC Amaravati) ఆధ్వర్యంలో సీఆర్డీయే (CRDA) కార్యాలయం ఎదుట రైతులు (Farmers) ఆందోళనకు దిగారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దళిత జేఏసీ అమరావతి (Dalit JAC Amaravati) ఆధ్వర్యంలో సీఆర్డీయే (CRDA) కార్యాలయం ఎదుట రైతులు (Farmers) ఆందోళనకు దిగారు. అసైన్డ్ (Assigned) రైతులకు కౌలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ద్వారం వద్ద రైతులు బైటాయించారు. ఈ సందర్భంగా దళిత జేఎసి నేత మార్టిన్ (Martin) మాట్లాడుతూ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి (Jaganmohanreddy) మమ్మలను ఆదుకుంటామని హామీ ఇచ్చారని, అసైన్డ్ రైతులకు నేనున్నా అంటూనే...‌ ఇవాళ నట్టేట ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా అసైన్డ్ రైతులకు కౌలు ఇవ్వడం లేదన్నారు. కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉందన్నారు. అమరావతిలో అసైన్డ్ రైతుల ఆకలి కేకలు సీఎం జగన్‌కు పట్టవా? అని ప్రశ్నించారు. సీఆర్డీయే అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదన్నారు. సమావేశాల పేరుతో మమ్మలను తుళ్లూరు, విజయవాడలకు తిప్పుతున్నారని, వెంటనే అసైన్డ్ రైతులకు కౌలు చెల్లించేలా అధికారులు, ప్రభుత్వం స్పందించాలని మార్టిన్ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-01-23T12:21:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising