బైక్ను ఢీకొన్న లారీ..యువకుడి మృతి
ABN, First Publish Date - 2023-03-31T01:10:07+05:30
విజయవాడ - హైదరా బాద్ 65వ నంబరు జాతీయ రహదారిపై కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు.
కంచికచర్ల రూరల్, మార్చి 30: విజయవాడ - హైదరా బాద్ 65వ నంబరు జాతీయ రహదారిపై కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎదుట గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. పరిటాల గ్రామానికి చెందిన కఠారపు అనిల్కుమార్(25) కంచికచర్ల వైపు నుంచి బైక్పై పరిటాల వైపు వెళుతుండగా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ద్విచక్రవాహనం నుజ్జునుజ్జయ్యింది. ఘటనా స్థలాన్ని నందిగామ సీఐ నాగేంద్రకుమార్ పరిశీలించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని నందిగామ ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. లారీ డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2023-03-31T01:10:07+05:30 IST