ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రభుత్వ భూ ఆక్రమణలో వైసీపీ నేతలు

ABN, First Publish Date - 2023-09-19T23:05:39+05:30

బండపల్లె పంచాయతీ పరిధి అభయహస్త ఆంజనే యస్వామి దేవాలయం సమీప సర్వే నెంబర్‌ 327 లో సుమారు పదెకరాలకు పైగా ప్రభుత్వ భూమిని బండపల్లె వద్ద కొందరు వైసీపీ నేతలు రాజకీయ నే తల అండదండలతో ఆక్ర మిస్తున్నారు.

హిటాచీలతో ప్రభుత్వ భూమిని అక్రమంగా చదును చేస్తున్న వైసీపీ నేతలు

రామాపురం, సెప్టెంబరు19: బండపల్లె పంచాయతీ పరిధి అభయహస్త ఆంజనే యస్వామి దేవాలయం సమీప సర్వే నెంబర్‌ 327 లో సుమారు పదెకరాలకు పైగా ప్రభుత్వ భూమిని బండపల్లె వద్ద కొందరు వైసీపీ నేతలు రాజకీయ నే తల అండదండలతో ఆక్ర మిస్తున్నారు. గతంలో ఈ భూమిని గోశాలకు కావాలని తిరుమల, తిరుపతి దేవస్థానా నికి ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి అనుమతులు రాలేదు. గతంలోనే నాలుగు గ్రామా లు సరిహద్దు గ్రామ ప్రజలు ఈ భూమి దేవస్థాన గోశాలకు అవసరమని తహసీ ల్దార్‌కు చెప్పారని అంటున్నారు. గతంలోనే ఈ భూమిలో తహసీల్దార్‌ సూచికబోర్డును ఏర్పాటు చేశారు.

ఎవరైనా అనుమతి లేనిది ఏమీ చేయకూడదని బోర్డు ఏర్పాటు చేశా రు. అయితే ప్రభుత్వ అధికారుల ఉత్తర్వులను పక్కనపెట్టి వైసీపీ నేతలు అక్రమంగా హిటాచీలతో గుట్టలను సదరం చేస్తున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న ఆక్రమణ గురించి పలు గ్రామాల ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ అరవింద కుమార్‌ను వివరణ కోరగా ప్రభుత్వ భూములు ఎవరైనా గానీ అనుమతులు లేనిదే ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వివరణ ఇచ్చారు.

Updated Date - 2023-09-19T23:05:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising