బైక్ను ఢీకొట్టిన లారీ... కొడుకు మృతి
ABN, First Publish Date - 2023-02-06T23:43:55+05:30
సరుకుల కోసం దుకాణానికి తండ్రి కొడుకులు బైక్లో ప్రొద్దుటూరు పట్టణంలోకి వస్తుండగా వెనుకవైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బైక్లో వెనుకవైపు కూర్చొని ఉన్న కుమారుడు మోపూరి ఆనంద్ అలియాస్ మహేష్కుమార్ (15) సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
తండ్రికి తీవ్రగాయాలు
ప్రొద్దుటూరు క్రైం, ఫిబ్రవరి 6 : సరుకుల కోసం దుకాణానికి తండ్రి కొడుకులు బైక్లో ప్రొద్దుటూరు పట్టణంలోకి వస్తుండగా వెనుకవైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బైక్లో వెనుకవైపు కూర్చొని ఉన్న కుమారుడు మోపూరి ఆనంద్ అలియాస్ మహేష్కుమార్ (15) సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తండ్రికి తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మండల పరిధి బొజ్జవారిపల్లె క్రాస్ వద్ద సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు... చాపాడు మండలం అనంతపురం గ్రామానికి చెందిన మోపూరి రాజారత్నం గ్రామంలోనే కిరాణా దుకాణం నిర్వహిస్తూ, కూలీ పనులకు వెళ్తుండేవాడు. ఇతనికి ఇద్దరు కుమారులు పెద్దకుమారుడు ప్రేమ్కుమార్, చిన్నకుమారుడు ఆనంద్ అలియాస్ మహేష్కుమార్. ఇద్దరు తండ్రితో కలిసి కూలిపనులకు వెళ్తుండేవారు. ఈ నేపధ్యంలో సోమవారం ఉదయం తమ కిరాణా షాపునకు సరుకుల కోసం రాజరత్నం తన చిన్నకుమారుడు ఆనంద్తో కలిసి బైక్లో అనంతపురం నుంచి ప్రొద్దుటూరుకు బయలుదేరారు. బొజ్జవారిపల్లె సమీపంలో ఎదురుగా జీవాలు రావడంతో వాటిని తప్పించుకుని వెళ్లేక్రమంలో... వెనుకవైపు నుంచి అతివేగంగా వచ్చి లారీ ఢీకొంది. దీంతో బైక్ పై నుంచి కింద పడ్డ ఆనంద్పై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రాజరత్నంకు తీవ్రగాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్ఐ హైమావతి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలం చేరుకుని... రాజరత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆనంద్ చనిపోయిన విషయం తెలుసుకుని కుటుంబసభ్యులు ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు.
Updated Date - 2023-02-06T23:43:58+05:30 IST