పన్నులు వెంటనే తగ్గించి... న్యాయం చేయాలి
ABN, First Publish Date - 2023-04-03T23:43:54+05:30
నాపరాయి పరిశ్రమపై కొత్తగా వేసిన పన్నులను వెంటనే తగ్గించి తమకు న్యాయం చేయాలని ఎర్రగుంట్ల నాపరాయి పరిశ్రమకు చెందిన యజమానులు సోమవారం గనులశాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విజయవాడలో కలిసి విజ్ఞప్తి చేశారు.
విజయవాడలో మంత్రికి విజ్ఞప్తి
ఎర్రగుంట్ల, ఏప్రిల్ 3: నాపరాయి పరిశ్రమపై కొత్తగా వేసిన పన్నులను వెంటనే తగ్గించి తమకు న్యాయం చేయాలని ఎర్రగుంట్ల నాపరాయి పరిశ్రమకు చెందిన యజమానులు సోమవారం గనులశాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విజయవాడలో కలిసి విజ్ఞప్తి చేశారు. యజమానులు జక్కుచెన్నక్రిష్ణారెడ్డి, రాజారెడ్డిలు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్రెడ్డితో కలిసి విజయవాడలో మరోసారి మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రాయల్టీ వసూళ్లు ప్రైవేటు సంస్థకు అప్పగించి తమపై భారం వేయడం ద్వారా పరిశ్రమ ఇబ్బంది పడుతోందని వివరించినట్లు వారు తెలిపారు. రాయల్టీవసూళ్లు పాతపద్ధతిలోనే కొనసాగించాలని కోరామన్నారు. లేదంటే పరిశ్రమ మూతపడి వేలామంది ఉపాధిని కోల్పోయే ప్రమాదం ఉందని వివరించామన్నారు. ఇందుకు మంత్రి స్పందించి.. ఈవిషయంపై ఫైల్ తయారు చేయాలని ఓఎస్డీని ఆదేశించారని తెలిపారు.
Updated Date - 2023-04-03T23:43:54+05:30 IST