భూముల రీ సర్వే పనుల పరిశీలన
ABN, First Publish Date - 2023-06-02T23:40:05+05:30
మండలంలో జరుతున్న భూముల రీ సర్వే పనులను మదనపల్లె ఆర్డీవో ఎంఎస్ మురళి శుక్రవారం పరి శీలించారు.
కలికిరి, జూన 2: మండలంలో జరుతున్న భూముల రీ సర్వే పనులను మదనపల్లె ఆర్డీవో ఎంఎస్ మురళి శుక్రవారం పరి శీలించారు. కొర్లకుంట గ్రామంలోని బాలయ్యకుంటవడ్డెపల్లె, బీరే వాండ్లపల్లె ప్రాంతాల్లో జరుతున్న రీ సర్వే రికార్డులను ఆయన పరిశీలించారు. భూముల హద్దులు నిర్ణయించే ముందు రైతు లందరికీ నోటీసులు అందజేసి ప్రారంభించాలని, రైతుల సమ క్షంలోనే సర్వే పనులు చేపట్టాలని లేదంటే తుది సర్వేపై రైతు లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే సమస్యలు వస్తాయని చెప్పారు. అంతకు ముందు ఆయన మండల రెవెన్యూ కార్యాలయంలో వివిధ అంశాలపై సమీక్షించారు. తహసీల్దారు భాగ్యలత, సర్వే యర్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-02T23:40:05+05:30 IST