ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2023-02-01T23:38:00+05:30

మండల పరిధిలోని కరమలవారిపల్లికి చెందిన ఎర్రంరెడ్డి రామ సంజీవరెడ్డి (34) అనే రైతు అప్పులబాధ తాళలేక ఇంట్లోనే విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ రామకృష్ణ బుధవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, ఫిబ్రవరి 1: మండల పరిధిలోని కరమలవారిపల్లికి చెందిన ఎర్రంరెడ్డి రామ సంజీవరెడ్డి (34) అనే రైతు అప్పులబాధ తాళలేక ఇంట్లోనే విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్‌ఐ రామకృష్ణ బుధవారం తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. రామ సంజీవరెడ్డికి ఉన్న రెండు ఎకరాల పొలంతో పాటు కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేసుకునే వారు. ఈ క్రమంలో పొలానికి పురుగుల మందులు, విత్తనాలకు, కుటుంబ పోషణకు పలువురి వద్ద అప్పులు చేశాడు. పంటలు సరిగా పండక పోవడంతో అప్పులు ఎలా తీర్చాలని మనస్ధాపం చెంది మంగళవారం రాత్రి ఇంట్లోనే విషద్రావణం తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే జమ్మలమడుగు ఆస్పత్రికి తరలించగా చికిత్సలు పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందాడు. రామ సంజీవరెడ్డి భార్య కృష్ణ కుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.

Updated Date - 2023-02-01T23:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising