రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి
ABN, First Publish Date - 2023-06-26T23:13:07+05:30
రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ పిలుపునిచ్చారు.
కడప (సెవెన్రోడ్స్), జూన్ 26: రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ పిలుపునిచ్చారు. జూలై 29, 30 తేదీల్లో మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సభ్యులు లింగమూర్తి, సిద్దిరామయ్య, మగ్బుల్బాషా, శంకర్లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మహాసభ కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాయలసీమ సీమలో మానవవనరులు, ఖనిజ సంపద, సహజ వనరులు పుష్కలంగా ఉన్నా అవకాశాలు లేక ప్రజలు కరువులు, వలసలు ఆత్మహత్యలతో అల్లాడుతున్నారన్నారు. పాలక, ప్రతిపక్షాలు రాయలసీమ ప్రాంతానికి చేస్తున్న అన్యాయం పట్ల సీమ ప్రజలు ఇప్పుడైనా ఉద్యమించక తప్పదని, లేకపోతే మరోమారు రాయలసీమ నుంచి రాజధాని చేజారిపోయే అవకాశం ఉందన్నారు. జూలై 29, 30 తేదీల్లో కడప పట్టణంలో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నగర కార్యదర్శివర్గ సభ్యురాలు లక్ష్మీదేవి, ప్రసాద్, సుబ్బరాయుడు, రమేష్, నగర నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T23:13:07+05:30 IST