ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేతలపై రౌడీ రాజకీయాలు మానుకోండి

ABN, First Publish Date - 2023-02-06T23:28:33+05:30

టీడీపీ నేతలపై రౌడీ రాజకీయాలు మానుకోవాలని వైసీపీ ్ట నేతలకు టీడీపీ రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్‌ సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైసీపీ నేతలకు బీసీ సెల్‌ అధ్యక్షుడు సురేంద్రయాదవ్‌ సూచన

కురబలకోట, జనవరి 6: టీడీపీ నేతలపై రౌడీ రాజకీయాలు మానుకోవాలని వైసీపీ ్ట నేతలకు టీడీపీ రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్‌ సూచించారు. మాజీ మంత్రి, టీడీపీ బీసీ సెల్‌ రాష్ట్ల్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్రను అక్ర మంగా అరెస్ట్‌ చేయడాన్ని ఆయన ఖండించారు. సోమవారం మండలంలోని అంగళ్ళులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నించే గొంతు నొక్కడానికి ఇలాంటి అక్రమ అరెస్టులకు పాల్పడుతు న్నారన్నారు. వెంటనే కొల్లు రవీంద్రను బేషరతుగా విడుదల చేయాలని, లేకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం ఒక పక్క బీసీల ఓట్ల కోసం బీసీలడిక్లరేషన, బీసీ గర్జన పేరుతో నాటకమాడుతూ మరో పక్క బీసీలను అణగదొక్కుతున్నారని ఆరోపించారు. గత మూడున్నరేళ్ళ పాలనలో 26మంది బీసీలు హత్యలకు గురయ్యారని వందలాది మందిపై అక్రమ కేసులు పెట్టార న్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలపై దాడులు హెచ్చుమీరాయన్నారు.

Updated Date - 2023-02-06T23:28:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising