ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత సామరస్యానికి ప్రతీకగా

ABN, First Publish Date - 2023-02-06T23:05:18+05:30

మత సామరస్యానికి ప్రతీకగా మదనపల్లె నుంచి టీటీడీ అన్నదాన ట్రస్టుకు స్థానిక కూరగాయల మార్కెట్‌లోని దాదాపీర్‌, ఖాజా అనే వ్యాపారులు ఎనిమిది టన్నుల కూరగాయలు సోమవారం తిరుమలకు తరలించారు.

తిరుమలకు లారీలో తీసుకెళుతున్న కూరగాయలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీటీడీకి 8 టన్నుల కూరగాయలు తరలింపు

మదనపల్లె అర్బన్‌, ఫిబ్రవరి 6: మత సామరస్యానికి ప్రతీకగా మదనపల్లె నుంచి టీటీడీ అన్నదాన ట్రస్టుకు స్థానిక కూరగాయల మార్కెట్‌లోని దాదాపీర్‌, ఖాజా అనే వ్యాపారులు ఎనిమిది టన్నుల కూరగాయలు సోమవారం తిరుమలకు తరలించారు. ఈ వాహనాన్ని టూటౌన్‌ సీఐ మురళీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మానవత్వానికి మించిన మతం లేదని అన్నారు. దాదాపీర్‌ మాట్లాడుతూ ప్రతిఏటా తిరుమల అన్నదాన ట్రస్టుకు రెండు మూడుసార్లు కూరగాయలు ఉచితంగా వితరణ చేస్తామన్నారు. భక్తిభావంతో ఈ కార్యక్రమం చేస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్‌ ఎస్‌ఐ రామాంజనేయులు, మండీ యాజమానులు మున్నా, రెడ్డిరామ్‌, చందన్‌, బోరుగుల మాము, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-06T23:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising