కోట్లు దోచిపెడుతున్న సాక్షి జగన్ది కాదా?: కూన
ABN, First Publish Date - 2023-01-05T03:41:02+05:30
తనకు పత్రికలు, టీవీలు లేవని సీఎం జగన్రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు.
అమరావతి, జనవరి 4(ఆంధ్రజ్యోతి): ‘‘తనకు పత్రికలు, టీవీలు లేవని సీఎం జగన్రెడ్డి నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. ప్రభుత్వ సొమ్ము ఏటా రూ.వందల కోట్లు దోచి పెడుతున్న సాక్షి పత్రిక, టీవీ ఆయనవి కావా ? కంటికి ఎదురుగా కనిపిస్తున్నవి కూడా తనవి కావని దబాయిస్తున్న ఈ సీఎంని మించిన పచ్చి అబద్ధాలకోరు ఈ భూమ్మీద మరొకరు ఉన్నారా..!’’ అని శాసనసభ మాజీ విప్ కూన రవికుమార్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
Updated Date - 2023-01-05T03:41:02+05:30 IST