ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సమస్యలను పరిష్కరించాలి

ABN, First Publish Date - 2023-01-18T00:08:42+05:30

గణపవరం గ్రామ పరిధిలో నూతనంగా ని ర్మిస్తున్న బైపాస్‌ రహదారి పనుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సమస్యలను వివరిస్తున్న ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

నాదెండ్ల, జనవరి 17 : గణపవరం గ్రామ పరిధిలో నూతనంగా ని ర్మిస్తున్న బైపాస్‌ రహదారి పనుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరా రు. గణపవరం మాజీ సర్పంచ వలేటి హిమవంతరావుతో పాటు రైతులతో కలసి మంగళవారం కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రాంతీయ అధికారి బెహరేను విజయవాడ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, హిమవంతరావులు రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రాం తీయ అధికారి దృష్టికి తీసుకువెళ్ళారు. గణపవరం గ్రామం నుంచి అ ప్పాపురం వెళ్ళే రహదారి వద్ద బైపాస్‌కు అండర్‌ పాసు వంతెన నిర్మించాలని కోరారు. అదేవిధంగా బైపాస్‌ పనుల వల్ల సాగు నీటి కా లువలు పూడిపోయి రైతులు నష్ట పోతున్నారన్నారు. సాగర్‌ కాలువ లకు పైపులైనలు సక్రమంగా ఏర్పాటు చేయక పోవటంతో వర్షపు నీటితో పాటు సాగర్‌ నీరు ఎదురు తన్ని పొలాల్లోకి ప్రవహించటం వల్ల కంది, పత్తి రైతులు నష్టపోయారన్నారు. ఇలాంటి సమస్య పున రావృతం కాకుండా పైపులైనలు సక్రమంగా ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణదేవరాయలు విన్నవించారు. రైతులు ప్రాంతీయ అధికారి బెహ రేకు ఎంపీ సమక్షంలో వినతి పత్రం అందజేశారు. అన్ని సమస్యలు విన్న ఆయన సానుకూలంగా స్పందించినట్టు రైతులు పేర్కొన్నారు.

Updated Date - 2023-01-18T00:08:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising