కుడి జలవిద్యుత్ కేంద్రం సిబ్బందికి అభినందన
ABN, First Publish Date - 2023-03-26T00:08:08+05:30
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడి జల విద్యుత్ కేంద్రం ద్వారా ఈ ఏడాది అత్యధికంగా 295.5 ఎంయూ విద్యుత్ ఉత్పత్తి చేయడంతో అధికారులు, సిబ్బందిని జలవిద్యుత్ కేంద్రం ఎండీ శ్రీధర్ అభినందించారు.
విజయపురిసౌత్, మార్చి25: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కుడి జల విద్యుత్ కేంద్రం ద్వారా ఈ ఏడాది అత్యధికంగా 295.5 ఎంయూ విద్యుత్ ఉత్పత్తి చేయడంతో అధికారులు, సిబ్బందిని జలవిద్యుత్ కేంద్రం ఎండీ శ్రీధర్ అభినందించారు. జలవిద్యుత్ కేంద్రం నిర్మితమై 40 ఏళ్లు పూర్తి కావడంతో అధికారులు నిర్వహించిన కార్యక్రమానికి శనివారం ఆయన హాజరై మాట్లాడారు. 2006, 2007 సంవత్సరాల్లో 283.51 ఎంయూ విద్యుత్ ఉత్పత్తిని అధిగమించి ఈ ఏడాది 295.5 ఎంయూ చేరడంతోపాటు ఇంకా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉందన్నారు. అనంతరం వివిధ విభాగాల్లో పనిచేసి రిటైర్ అయిన పలువురు సిబ్బందిని ఆయన సన్మానించారు. కార్యక్రమంలో సీఈ సుధీర్బాబు, ఎస్ఈ శ్రీనివాస, డీఈ వైఎస్ఆర్కే ప్రసాద్తోపాటు సిబ్బంది పాల్గొన్నారు. కాగా కుడి జలవిద్యుత్ కేంద్రంలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ లేబర్ జీతాలు పెంచాలని 327 యూనియన్ ఆధ్వర్యాన ఎండీ శ్రీధర్కు వినతిపత్రం అందించారు. వినతిపత్రం అందించిన వారిలో యూనియన్ అధ్యక్షుడు సాంబశివరావు, కార్యదర్శి సూరత్చంద్, రామకృష్ణ, కిరణ్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-03-26T00:08:08+05:30 IST