ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు అభ్యర్థులకు 13 నుంచి ఫిట్‌నెస్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2023-02-21T03:20:23+05:30

పోలీసు ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మార్చి 13 నుంచి శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్‌ బోర్డు (పీఆర్‌బీ) చైర్మన్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా తెలిపారు. గత నవంబరు 28న పీఆర్‌బీ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ద్వారా కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 22న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించామని గుర్తు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): పోలీసు ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మార్చి 13 నుంచి శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్‌ బోర్డు (పీఆర్‌బీ) చైర్మన్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా తెలిపారు. గత నవంబరు 28న పీఆర్‌బీ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ద్వారా కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరి 22న ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించామని గుర్తు చేశారు. అర్హత మార్కులు సాధించిన వారిని పీఎంటీ, పీఈటీ కోసం రెండో దశలో ఆల్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 13 నుంచి 20వరకూ సమయం ఇచ్చినట్లు చెప్పారు. నిర్ణీత గడువులోగా స్పందించిన అభ్యర్థులు మార్చి 1 నుంచి 10 వరకూ పీఆర్‌బీ వెబ్‌సైట్‌ ద్వారా కాల్‌ లెటర్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సిన్హా సూచించారు. పీఎంటీ, పీఈటీల్లో అర్హత సాధించిన వారికి ఏప్రిల్‌ చివరి వారంలో తుది రాత పరీక్ష ఉంటుందని తెలిపారు.

Updated Date - 2023-02-21T03:20:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising