ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మాయమాటలతో ప్రజలను మోసం చేస్తోన్న వైసీపీ

ABN, First Publish Date - 2023-07-17T00:35:54+05:30

రాష్ట్రంలోని అన్ని వర్గాలను వైసీపీ మాయమాటలతో మోసం చేస్తోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్రేయపురం, జూలై 16: రాష్ట్రంలోని అన్ని వర్గాలను వైసీపీ మాయమాటలతో మోసం చేస్తోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు విమర్శించారు. ఆత్రేయపురంలో టీడీపీ మండల అధ్యక్షుడు ముదునూరి వెంకట్రాజు అధ్యక్షతన ఆదివారం జరిగిన ఆ పార్టీ ఇంటిగ్రేటెడ్‌ శిక్షణ తరగతుల ముగింపు సభలో పలు వురు నేతలు ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. జగనన్న సురక్ష పథకం కేవలం ప్రచార ఆర్భాటం కోసమేనని, దానివల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. హక్కుల కోసం అంగన్‌వాడీలు రోడ్డెక్కితే అక్రమ అరెస్టులతో వేధించడం దారుణమన్నారు. ప్రజల దీవెనలతో చంద్రన్న పాలన రావడం తథ్యమన్నారు. అసెంబ్లీ పరిశీలకుడు వాసిరెడ్డి రాంబాబు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల కోసం రూపొందించిన యాప్‌లను సద్వినియోగం చేయాలన్నారు. సమావే ంలో క్లస్టర్‌ ఇన్‌చార్జిలు కరుటూరి నరసింహారావు, ముళ్లపూడి భాస్కరరావు, కాయల జగన్నాథం, పాండ్రంగి రవిచంద్ర, తోటకూర సుబ్బరాజు, కుదప కృష్ణమూర్తి, జుజ్జవరపు హరిబాబు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-07-17T00:35:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising