అలరించిన కవి సమ్మేళనం
ABN, First Publish Date - 2023-01-18T00:25:39+05:30
కోనసీమ రచయితల సం ఘం, శ్రీశ్రీ కళా వేదిక జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సాహితీ హేమంతం కవి సమ్మేళనం నిర్వహించారు.
అమలాపురం టౌన్, జనవరి 17: కోనసీమ రచయితల సం ఘం, శ్రీశ్రీ కళా వేదిక జిల్లా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సాహితీ హేమంతం కవి సమ్మేళనం నిర్వహించారు. కోరసం అధ్యక్షుడు బీవీవీ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గౌరవాధ్యక్షుడు రుద్రరాజు నానిరాజు కవులు సామాజిక చైతన్యం కలిగించే రచనలు చేయాలని సూచించారు. శ్రీశ్రీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు నల్లా నరసింహమూర్తి మాట్లా డుతూ కవులను ఉత్సాహపరిచే విధానం ఉండాలని సూచిం చారు. సంక్రాంతి కవి సమ్మేళనంలో డాక్టర్ శ్రీపాద రామకృష్ణ, మాకే బాలార్జున సత్యనారాయణ, విత్తనాల వెంకటేశ్వరరావు, కడలి సత్యనారాయణ కవితాగానం చేశారు. జడ్పీటీసీలు పందిరి శ్రీహరి, గెడ్డం సంపదరావు పాల్గొన్నారు. సాహితీ కవి సమ్మేళనం అనంతరం ఏపీ భవన, ఇతర నిర్మాణరంగ కార్మిక యూనియన్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన గళ్లా రామును మాజీ ఎంపీపీ త్సల్లా బిందుమాధవరావు, నానిరాజు ఆధ్వర్యంలో సత్కరించారు.
Updated Date - 2023-01-18T00:25:41+05:30 IST