ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వ్యాన్‌ కింద పడి ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2023-08-22T00:30:41+05:30

గోకవరం మండలంలోని తిరుమలాయపాలెం శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి వ్యక్తులు మృతిచెందారు.

గోకవరం, ఆగస్టు 21: గోకవరం మండలంలోని తిరుమలాయపాలెం శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరి వ్యక్తులు మృతిచెందారు. సామ ర్లకోటకు చెందిన గుమలాపురం శ్రీను(31), మిరియాల నాగు (29) వీరభద్రుడి సంబరం నిమిత్తం మోటార్‌ సైకిల్‌పై కోరుకొండ మండలం గుమ్ములూరు వెళ్లారు. తిరిగి స్వగ్రామం వెళ్తున్న క్రమంలో కడేలమ్మ ఆలయం సమీపంలో ఎదురుగా జామాయిల్‌ లోడుతో అతివేగంగా వస్తున్న ఐషర్‌ వ్యాన్‌ మోటార్‌సైకిల్‌ను ఢీకొని బోల్తా పడింది. దీంతో మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరూ వ్యాన్‌ కింద పడి అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికుల సహాయంతో పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. కాగా గుమలాపురం శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారులు ఉండగా, నాగుకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. గాయపడిన వ్యాన్‌ డ్రైవర్‌, క్లీనర్‌ను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తర లించడంతో పాటు మృతదేహాలను కూడా తరలించారు. ఈమేరకు ఎస్‌ఐ నాగబాబు కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-08-22T00:30:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising