నేటి నుంచి వాడపల్లి వెంకన్న కల్యాణోత్సవాలు
ABN, First Publish Date - 2023-03-31T00:05:20+05:30
కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవాలకు శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణం నిర్వహించి అంకురార్పణ చేయనున్నారు.
ఆత్రేయపురం,మార్చి 30: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి దివ్య కల్యాణ మహోత్సవాలకు శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణం నిర్వహించి అంకురార్పణ చేయనున్నారు. ఏప్రిల్ 1న స్వామివారి కల్యాణ మహోత్సవం, తీర్థం, రథోత్సవం నిర్వహించనున్నారు. అశేష భక్తజనం తరలి వస్తున్నందున యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. వాడపల్లి ఆలయ పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలంకరణతో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. ముఖద్వారం వద్ద భక్తులకు స్వాగతం పలికేందుకు భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రకాల విద్యుత్ వెలుగులతో ఆలయాన్ని తీర్చిదిద్దారు. ఫల పుష్పాలతో అలంకరించే పనిలో నిమగ్నమయ్యారు. తీర్థమహోత్సవంలో వినోదాత్మక ప్రదర్శనలు నిర్వాహకులు ఏర్పాటు చేస్తున్నారు.
Updated Date - 2023-03-31T00:05:20+05:30 IST