మతి స్థిమితంలేని మహిళ అప్పగింత
ABN, First Publish Date - 2023-03-31T00:17:51+05:30
ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఓ మతి స్థిమితంలేని మహిళను దిశ వన్స్టాప్ సెం టర్ సిబ్బంది అక్కున చేర్చుకుని కుటు ంబీకులకు అప్పగించిన సంఘటన గురువారం జరిగింది. వివరాలిలా ఉ న్నాయి. గత కొన్ని రోజులుగా సుమారు 30ఏళ్ల మతిస్థిమితం లేని మహిళ సా మర్లకోట రైల్వేస్టేషనలో ఉంటుందని ఈనెల 9న సామర్లకోట సెక్షన్ చీఫ్ కమర్షియల్ రైల్వే ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ
కాకినాడ క్రైం, మార్చి 30: ఉత్తరప్రదేశ్ రాష్ర్టానికి చెందిన ఓ మతి స్థిమితంలేని మహిళను దిశ వన్స్టాప్ సెం టర్ సిబ్బంది అక్కున చేర్చుకుని కుటు ంబీకులకు అప్పగించిన సంఘటన గురువారం జరిగింది. వివరాలిలా ఉ న్నాయి. గత కొన్ని రోజులుగా సుమారు 30ఏళ్ల మతిస్థిమితం లేని మహిళ సా మర్లకోట రైల్వేస్టేషనలో ఉంటుందని ఈనెల 9న సామర్లకోట సెక్షన్ చీఫ్ కమర్షియల్ రైల్వే ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణకు సమాచారం అందించారు. ఆ మహిళకు వసతి కల్పించాలని పీడీ దిశ వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ర్టేటర్ ఆర్.శైలజను ఆ దేశించడంతో సెంటర్కు తరలించి వస తికల్పించారు. సిబ్బంది ఆ మహిళను వివరాలు అడగడంతో తనది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, గోరక్పూర్ అని మాత్రం చెప్పగల్గింది. సిబ్బంది ఆ మహిళ ఫొటో ను గోరక్పూర్ పోలీసులకు పంపించి ఆమె సమాచారాన్ని ఇచ్చారు. దాంతో అక్కడ పోలీసులు ఆ మహిళ కుటుం బసభ్యులతో ఇక్కడ వన్స్టాప్ సెంటర్ సిబ్బందితో మాట్లాడించగా ఆ మహిళ పేరు ప్రియాంక షైనీ అని తెలిపారు. షైనీ కుటుంబ సభ్యులు గురువారం దిశ వన్స్టాప్ సెంటర్కు చేరుకుని అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపి ఆమెను స్వగ్రామానికి తీసుకెళ్లారు.
Updated Date - 2023-03-31T00:17:51+05:30 IST