నేడు రోడ్డు కం రైలు బ్రిడ్జిపై రాకపోకలు బంద్
ABN, First Publish Date - 2023-03-26T01:22:14+05:30
రోడ్డు కం రైలు వంతెనపై హ్యాండ్ రైలింగ్, ఫుట్ఫాత్ల మరమ్మతుల కారణంగా ఆదివారం బ్రిడ్జిపై వాహన రాకపోకలను నిలుపుదల చేసినట్టు రాజమహేంద్రవరం ఆర్అండ్బీ ఎస్ఈ ఎస్బీవీ రెడ్డి తెలిపారు.
కొవ్వూరు, మార్చి 25 : రోడ్డు కం రైలు వంతెనపై హ్యాండ్ రైలింగ్, ఫుట్ఫాత్ల మరమ్మతుల కారణంగా ఆదివారం బ్రిడ్జిపై వాహన రాకపోకలను నిలుపుదల చేసినట్టు రాజమహేంద్రవరం ఆర్అండ్బీ ఎస్ఈ ఎస్బీవీ రెడ్డి తెలిపారు. కొవ్వూరు వైపు రోడ్డు కం రైలు బ్రిడ్జిపై పిట్టగోడ పడిపోయి, ప్రమాదకరంగా ఉండడంతో మరమ్మతులు చేపడుతున్న దృష్ట్యా ఆదివారం ఒక్కరోజు వాహన రాకపోకలను నివారించేందుకు, ఆర్అండ్బీ, రైల్వే అధికారుల అభ్యర్థన మేరకు కలెక్టర్ కె.మాధవీలత ఆదేశాలు జారీచేశారు. మార్చి 26వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోడ్డు కం రైలు బ్రిడ్జిపై ఏ విధమైన వాహనాలు అనుమతించమని, పోలీసులు, ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులు సహకరించాలని ఎస్ఈ కోరారు.
Updated Date - 2023-03-26T01:22:14+05:30 IST