ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అద్దెకు దిగి..యజమానిని బంధించి

ABN, First Publish Date - 2023-01-26T00:13:58+05:30

అద్దెకు దిగిన దంపతులు సమయం చూసుకుని వృద్ధురాలిని బంధించి బంగారు ఆభరణాలు లాక్కొని పరారయ్యారు. పిఠాపురం పట్టణంలోని సీతయ్యగారితోటలో కొత్తపల్లి సూర్యప్రభావతి అనే వృద్ధురాలు తన కుమారుడితో కలిసి నివాసముంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం, జనవరి 25: అద్దెకు దిగిన దంపతులు సమయం చూసుకుని వృద్ధురాలిని బంధించి బంగారు ఆభరణాలు లాక్కొని పరారయ్యారు. పిఠాపురం పట్టణంలోని సీతయ్యగారితోటలో కొత్తపల్లి సూర్యప్రభావతి అనే వృద్ధురాలు తన కుమారుడితో కలిసి నివాసముంటోంది. పక్క పోర్షన్‌ ఖాళీగా ఉండటంతో సంక్రాంతికి ముందు ఓ దంపతులకు అద్దెకు ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత వారు ఊరెళ్లి వస్తామని చెప్పి మంగళవారం తిరిగి వచ్చారు. బుధవారం ఉదయం కుళాయిల ద్వారా నీరు రావడం లేదని ప్రభావతికి చెప్పడంతో ఆమె ఇంటి లోపలకు రాగానే దంపతులు ఆమె కాళ్లు, చేతులు కట్టివేసి, మూతికి టేపు వేసి బంగారు గొలుసు, 8 గాజులు, చేతి ఉంగరం, చెవి దుద్దులు, కాళ్ల పట్టీలు, సెల్‌ఫోన్‌ లాక్కొని పరారయ్యారు. వెళ్లే ముందు ఆమెను కొట్టారు. ఆమె కేకలు వేసేందుకు ప్రయత్నించగా చుట్టుపక్కల వారు వచ్చి కట్లు విప్పారు. బంగారం 200 గ్రాములు ఉంటుందని ప్రభావతి తెలిపారు. ప్రభావతికి సహాయంగా ఉంటున్న మహిళ దోపిడీ జరిగిన సమయంలో బయటకు వెళ్లినట్లు చెబుతున్నారు. పిఠాపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Updated Date - 2023-01-26T00:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising