ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేడపై నుంచి పడిన నర్సింగ్‌ విద్యార్థిని.. తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2023-03-19T02:13:12+05:30

అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ఉన్న వైవీఎస్‌ అండ్‌ బీఆర్‌ఎస్‌ఎం నర్సింగ్‌ కళాశాల విద్యార్థిని పల్లవిని శనివారం ఉదయం తోటి విద్యార్థినులు మేడ పైనుంచి గెట్టివేయడంతో ఆమె కాలు, చెయ్యి మూడు చోట్ల విరిగాయి.

గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పల్లవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమలాపురం, మార్చి 18: అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో ఉన్న వైవీఎస్‌ అండ్‌ బీఆర్‌ఎస్‌ఎం నర్సింగ్‌ కళాశాల విద్యార్థిని పల్లవిని శనివారం ఉదయం తోటి విద్యార్థినులు మేడ పైనుంచి గెట్టివేయడంతో ఆమె కాలు, చెయ్యి మూడు చోట్ల విరిగాయి. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కళాశాల హాస్టల్‌ రూమ్‌లో 8 మంది విద్యార్థినులు ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఒకరి డబ్బులు పోవడంతో అందరి బ్యాగ్‌లను విద్యార్థినులు వెతికారు. కాగా శనివారం ఉదయం అల్పాహారం తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి తనను గెంటేశారని పల్లవి చెబుతోంది. పల్లవి తొలుత కళ్లు తిరిగి పడిపోయినట్టు చెప్పినట్టు సమాచారం. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కె.శంకరరావును ఎస్‌ఐ అందే పరదేశి కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2023-03-19T02:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising