కదిలింది రామదండు..
ABN, First Publish Date - 2023-03-31T00:54:10+05:30
జై శ్రీరామ్.. జై శ్రీరామ్ నినాదాలతో రాజమహేంద్రవరం మారుమ్రోగింది. శ్రీరామనవమి సందర్భంగా గురువారం రాజమహేంద్రవరంలో పెద్దఎత్తున శోభాయాత్ర నిర్వహించారు.
రాజమహేంద్రవరం అర్బన్, మార్చి 30 : జై శ్రీరామ్.. జై శ్రీరామ్ నినాదాలతో రాజమహేంద్రవరం మారుమ్రోగింది. శ్రీరామనవమి సందర్భంగా గురువారం రాజమహేంద్రవరంలో పెద్దఎత్తున శోభాయాత్ర నిర్వహించారు. పుష్కరఘాట్ వద్ద సభ నిర్వహించిన అనంతరం పురవీధుల్లో భారీ ర్యాలీ జరిపారు. శ్రీకాకుళం సాధుపరిషత్ స్వామీజీ శ్రీనివాసానంద ఉద్వేగంతో మాట్లాడారు. భారతదేశం పుణ్యభూమి, ధన్యభూమి, త్యాగభూమి అని, శ్రీరాముడు నడయాడిని పుణ్యభూమి అని కీర్తించారు. రాబోయే రోజుల్లో హిందూ ధర్మాన్ని ఎవరు ప్రోత్సహిస్తారో, హిందూ ధర్మాన్ని ఎవరు గౌరవిస్తారో వారికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. మన హిందూ సంప్రదాయాన్ని నిలబెట్టాలని, హిందూ మనోభావాలను కాపాడేవారిని ఆదరించాలని అన్నారు. హిందూ వ్యతిరేకులకు చోటివ్వకండి అని స్పష్టం చేశారు. ఈ సభలో ఆర్ఎస్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు, పలు హైందవ సంస్థల ప్రతినిధులు, మద్దతుదారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-31T00:54:10+05:30 IST