ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సిలబస్‌ పూర్తిచేయకపోతే చర్యలు తప్పవు

ABN, First Publish Date - 2023-08-06T00:58:11+05:30

సిలబస్‌ పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ హెచ్చరించారు.

విద్యా శాఖ అధికారులకు సూచనలు చేస్తున్న ప్రవీణ్‌ప్రకాష్‌

రంగంపేట, ఆగస్టు, 5 : సిలబస్‌ పూర్తి చేయకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ హెచ్చరించారు. రంగంపేట మండలం కొత్తవీరంపాలెం ప్రాఽథమిక పాఠశాలను రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐదో తరగతి పాఠ్యపుస్తకాలను, సాధన పుస్తకాలను పరిశీలించి సిలబస్‌ ప్రకారం పాఠ్యాంశాలు పూర్తిచేయకపోవడం,దిద్దకపోవడంతో హెచ్‌ఎం సత్యనారాయణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి సంతృప్తి వ్యక్తం చేశారు.హెచ్‌ఎం ఎంవీడీ.ప్రసాదరావు, ఆంగ్ల ఉపాధ్యాయుడు పీటర్‌పాల్‌, విద్యార్ధుల కృషిని అభినందించారు.అనంతరం రంగంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మనబడి నాడు-నేడులో నిర్మితమైన మరుగుదొడ్లును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసి ప్రిన్సిపాల్‌ వి.శ్రీనివాసరావును అభినందించారు. ఆయన వెంట ఆర్‌జేడీలు ఐ.శారద,జి.నాగమణి, డీఈవో ఎస్‌.అబ్రహాం,డీవీఈవో జె.వి.వి.ఎస్‌.సుబ్రహ్మణ్యం,ఆర్‌ఐవో ఎంఎస్‌వీఎల్‌ నరసింహం, డీవైఈవో తిరుమలదాస్‌ ఎంఈవోలు తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-08-06T01:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising