స్మార్ట్మీటర్ల పేరుతో రాష్ట్రంలో దోపిడి
ABN, First Publish Date - 2023-05-21T00:04:56+05:30
గొల్లప్రోలు, మే 20: స్మార్ట్మీటర్ల పేరుతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల నుంచి భా రీ దోపిడి జరుగుతోందని తెలుగుదేశం పార్టీ రా ష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు సార్లు వివిధ రూపాల్లో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు.
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ
గొల్లప్రోలు, మే 20: స్మార్ట్మీటర్ల పేరుతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల నుంచి భా రీ దోపిడి జరుగుతోందని తెలుగుదేశం పార్టీ రా ష్ట్ర అధికార ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు సార్లు వివిధ రూపాల్లో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. నాలుగేళ్ల జగన్ పాలనలో రూ.57వేల కోట్లు మే ర చార్జీల బాదుడుతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యుత్, సౌర విద్యుత్ కొనుగోళ్లలో భారీ అవినీతి జరి గిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత వి ద్యుత్ ఇవ్వకుండా వారిని మోసం చేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసి తన బినామి కంపెనీలకు డబ్బులు దోచి పెడుతున్నారని తెలిపారు. ప్రజలపై మోయలేని భా రం మోపి మరోవైపు విద్యుత్ కోతలతో ఇబ్బం దులకు గురిచేస్తున్నారని వర్మ అన్నారు. మాజీ జడ్పీటీసీ మడికి ప్రసాద్, చిట్టూరి సుబ్బారావు, జల్లిగంపల రాంబాబు, సుబ్బు రామకృష్ణ, గోకరకొండ నారాయణస్వామి, గారపాటి సుబ్రహ్మణ్యం, బండారు రామారావు పాల్గొన్నారు.
Updated Date - 2023-05-21T00:04:56+05:30 IST