గొప్పలు చెబుతున్న ఎమ్మెల్యే దొరబాబు
ABN, First Publish Date - 2023-03-01T00:31:46+05:30
ఉప్పాడ బీచ్లో హార్బర్ నిర్మాణం నిమిత్తం రూ.422 కోట్ల నిధులు మంజూరు చేయించినట్టు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు గొప్పలు చెబుతున్నారని, మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో ఎటువంటి నిధుల మంజూరు చేయని ఎమ్మెల్యే దొరబాబుకు సిగ్గుండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అ
టీడీపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి వర్మ
కొత్తపల్లి, ఫిబ్రవరి 28: ఉప్పాడ బీచ్లో హార్బర్ నిర్మాణం నిమిత్తం రూ.422 కోట్ల నిధులు మంజూరు చేయించినట్టు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు గొప్పలు చెబుతున్నారని, మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో ఎటువంటి నిధుల మంజూరు చేయని ఎమ్మెల్యే దొరబాబుకు సిగ్గుండాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ విమర్శింంచారు. మంగళవారం ఆయన కొత్తపల్లి మండలం ఉప్పాడ, అమీనాబాద్ గ్రామా ల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హార్బర్ ఇన్స్పెక్షన్, పబ్లిక్ హియరింగ్ చేయించి దానిని డిఫెన్స్ సర్కిల్లో ఉంటే మళ్లీ దానిని వెనక్కి పంపించి అటవీ, పర్యావరణ అనుమతులు, ఆసియా బ్యాంక్ ఇన్స్పెక్షన్ పనులు సైతం చేయించిన విషయాన్ని వర్మ గుర్తుచేశారు.
Updated Date - 2023-03-01T00:31:46+05:30 IST