ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బైక్‌ను లారీ ఢీకొనడంతో ఒకరి మృతి

ABN, First Publish Date - 2023-03-26T00:19:59+05:30

జగ్గంపేట శివారు కాకినాడ రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్‌ బంకు ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైనట్లు ఎస్‌ఐ సీహెచ్‌ విద్యాసాగర్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

జగ్గంపేట, మార్చి 25: జగ్గంపేట శివారు కాకినాడ రోడ్డులోని హెచ్‌పీ పెట్రోల్‌ బంకు ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైనట్లు ఎస్‌ఐ సీహెచ్‌ విద్యాసాగర్‌ తెలిపారు. కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామానికి చెందిన బర్రె మాణిక్యంతో కలిసి బూరుగుపూడి నుంచి కాట్రావులపల్లి బంఽధువుల ఇంటికి మోటార్‌ సైకిల్‌పై వెళ్తుండగా హెచ్‌పీ పెట్రోల్‌ బంకు సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌ నడుపుతున్న మద్దిరాల శ్రీనివాసరావు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందగా, బర్రె మాణిక్యం కాలుకు గాయమైనట్లు ఎస్‌ఐ తెలిపారు. బర్రె మాణిక్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2023-03-26T00:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising