ఘనంగా జయేంద్ర సరస్వతి ఆరాధనోత్సవాలు
ABN, First Publish Date - 2023-03-05T02:23:01+05:30
జగద్గురువులు, పరమాచార్య జయేంద్ర సరస్వతి స్వాముల మహారాధనోత్సవాలు కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో నిర్వహించారు.
శంకర విజయేంద్ర సరస్వతి శోభాయాత్ర
కొవ్వూరు, మార్చి 4 : జగద్గురువులు, పరమాచార్య జయేంద్ర సరస్వతి స్వాముల మహారాధనోత్సవాలు కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో నిర్వహించారు. కొవ్వూరు పట్టణంలోని ఆంధ్రగీర్వాణ విద్యాపీఠం నుంచి శనివారం రథంపై జయేంద్ర సరస్వతి చిత్రపటంతో కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి పట్టణ పురవీధుల్లో శోభాయాత్రగా గోష్పాదక్షేత్రానికి చేరుకున్నారు. గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రధాన స్నానఘట్టంలో శివలింగానికి గోదావరి జలాలతో అభిషేకించారు. శంకరాచార్యుల విగహ్రానికి తులసి మాలవేసి నమస్కరించారు. అనంతరం క్షేత్రంలోని ధర్మజ్ఞాన కళావేదిక మండపంలో కంచి కామకోటి పీఠం 69వ పీఠాధిపతి జగద్గురువులు శంకరాచార్య జయేంద్ర సరస్వతి మహారాధనోత్సవాలను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. స్వామివారి సంకీర్తనా కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి కొవ్వూరు పట్టణ పరిసర ప్రాంతాల నుంచే కాకుండే ఇతర రాష్ట్రాల నుంచి అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కొవ్వూరు డీఎస్పీ వి.ఎస్.ఎన్.వర్మ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సంస్కృత పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.
Updated Date - 2023-03-05T02:23:01+05:30 IST