‘ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’
ABN, First Publish Date - 2023-06-03T00:07:00+05:30
పెద్దాపురం, జూన్ 2: నవత్నాలను ప్రజలకు చేరవేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు శుక్రవారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. పెద్దాపురం మండలాధ్యక్షుడు బీకే శర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఏపీజీఈఏ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జగన్నాథం, డి.వీరయ్య మాట్లాడారు. ప్రభు త్వం అమలుచేస్తున్న నవరత్నాలు, పలు సంక్షే మ పథకాలను ప్రజలకు చేర
పెద్దాపురం, జూన్ 2: నవత్నాలను ప్రజలకు చేరవేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలంటూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు శుక్రవారం రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. పెద్దాపురం మండలాధ్యక్షుడు బీకే శర్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఏపీజీఈఏ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జగన్నాథం, డి.వీరయ్య మాట్లాడారు. ప్రభు త్వం అమలుచేస్తున్న నవరత్నాలు, పలు సంక్షే మ పథకాలను ప్రజలకు చేరవేస్తున్న ఉద్యోగుల సేవలను ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, సీపీఎస్ ర ద్దు, ప్రతీనెలా ఒకటవ తేదీన జీతభత్యాలు చెల్లించేలా చట్టం చేయాలన్నారు. గత నాలుగేళ్లుగా అనేక నివేదికలను సమర్పించినా ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చకపోవడం ఉద్యోగుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలన్నారు. కార్యక్రమంలో సీహెచ్.పాపారావు, విజయ్కుమార్, భాస్కరరా వు, బి.సూర్యనరాయణ, ఉద్యోగులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-03T00:07:00+05:30 IST