ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తేలుకుట్టి బాలిక మృతి

ABN, First Publish Date - 2023-09-21T23:30:13+05:30

ఒకటో తరగతి చదువుతున్న బాలిక తేలు కాటుకు గురై కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. గోకవరం మండలం ఎర్రంపాలెం గ్రామానికి చెందిన నూకపర్తి తబిత(6) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది.

జీజీహెచ్‌(కాకినాడ), సెప్టెంబరు 21: ఒకటో తరగతి చదువుతున్న బాలిక తేలు కాటుకు గురై కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. గోకవరం మండలం ఎర్రంపాలెం గ్రామానికి చెందిన నూకపర్తి తబిత(6) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. బాలిక బుధవారం తన ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా తేలు కాటుకు గురైంది. కాకినాడ జీజీహెచ్‌కు ఆమెను తరలించారు. అక్కడ పిడియాట్రిక్స్‌ విభాగంలో బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించి గురువారం మృతి చెందింది. తబిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. తబితకు తండ్రి శ్రీను, తల్లి ప్రశాంతి ఉన్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

Updated Date - 2023-09-21T23:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising