రైతు సమస్యలపై స్పందించకపోవడం విచారకరం
ABN, First Publish Date - 2023-06-26T00:20:57+05:30
రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైసీపీ ప్రభుత్వం రైతు లకు ఎదురౌతున్న సమస్యలపై స్పందించకపోవడం విచారకరమని, ఆకుమ డులు వేసుకోవడం నుంచి ధాన్యం అమ్ముకునే వరకు రైతులు అనేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
నేటికీ పొలాలకు చేరని కాలువ నీరు
ప్రభుత్వ నిర్లక్ష్యంతో వెనుకబడిపోతున్న పంటలు
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి
అనపర్తి, జూన్ 25: రైతు ప్రభుత్వమని చెప్పుకొనే వైసీపీ ప్రభుత్వం రైతు లకు ఎదురౌతున్న సమస్యలపై స్పందించకపోవడం విచారకరమని, ఆకుమ డులు వేసుకోవడం నుంచి ధాన్యం అమ్ముకునే వరకు రైతులు అనేక ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని రామవరంలో నదురుబాద మైనర్ కాలువ గుర్రపు డెక్క, తూటు కాడతో మూసుకుపోయిందని, నారు మడులు వేసుకునేందుకు కూడా నీరందడం లేదని స్థానిక రైతులు దృష్టికి తీసుకురావడంతో రామకృష్ణా రెడ్డి రైతులతో కలిసి ఆదివారం పరిశీలించారు. అక్కడి నుంచే ఇరిగేషన్ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్కు ఫోన్ చేసినా ఆయన స్పందించకపోవడంతో ధవళేశ్వరం ఎస్ఈకి ఫోన్చేసి కాలువ పరిస్థితిని, రైతుల ఇబ్బందులను వివరించారు. దీనికి స్పందించిన ఎస్ఈ కాలువలు పూడుకుపోవడం నిజమేనని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడతామని అన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్భాటంగా జూన్ 1వ తేదీన కాలువ లకు నీరు వదిలినా ఇప్పటికీ రైతులకు నీరు చేరువ కాలేదన్నారు. నీరు వదిలి నెల కావస్తున్నా కాలువల్లో ప్రవాహం లేకపోవడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పంటలు వెనుకబడి చివరకు రైతులు తుఫా నుల బారిన పడి నష్టపోతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లమిల్లి సుబ్బారెడ్డి, సత్తాలు, వీరభాస్కరరెడ్డి, బసివిరెడ్డి, కర్రి శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణరెడ్డి, అన్నవరం, పలువురు రైతులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T00:20:57+05:30 IST