సీఎం సార్.. మాట తప్పొద్దు
ABN, First Publish Date - 2023-06-03T01:22:57+05:30
కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు.
గోపాలపురం, జూన్ 2: కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంవీ సత్యనారాయణ డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గోపాలపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం రిలేనిరాహార దీక్ష చేశారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాట మేరకు సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలన్నారు. ప్రతి నెల ఒకటవ తేదీన అం దరికి జీతాలిచ్చేందుకు చట్టాన్ని రూపొందించి అమలు చేయాలన్నారు. అన్ని శాఖల్లోనూ కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజునే అన్ని బెనిఫిట్లను కల్పించాలన్నారు. పీఎఫ్ సొమ్ముకు భద్రత కల్పించి కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతన చట్టప్రకారం పనికి తగిన వేతనం ఇవ్వాలన్నారు. సీఎం సార్ హామీల అమలులో మాటతప్పవద్దు.. మడమ తిప్పవద్దు అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీకాంత రావు, ఐసీడీఎస్ పీవో సుం దరి, అంగన్వాడీ కార్యకర్త రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-03T01:22:57+05:30 IST