ఉత్తమ ప్రదర్శనగా ‘అంధస్వరం’
ABN, First Publish Date - 2023-03-26T01:32:25+05:30
రావులపాలెం సీఆర్సీ కాటన్ కళా పరిషత్ వేదికపై ఉగాదిని పురస్కరించుకుని మూడు రోజులు నిర్వహించిన నాటికల్లో ‘అంధస్వరం’ నాటిక ప్రథమ ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది.
రావులపాలెం, మార్చి 25: రావులపాలెం సీఆర్సీ కాటన్ కళా పరిషత్ వేదికపై ఉగాదిని పురస్కరించుకుని మూడు రోజులు నిర్వహించిన నాటికల్లో ‘అంధస్వరం’ నాటిక ప్రథమ ఉత్తమ ప్రదర్శనగా నిలిచింది. అందులోని కళాకారులకు రూ.3లక్షల నగదును ప్రభుత్వ విప్, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి శనివారం అందజేశారు. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా నిలిచిన ‘నిశ్శబ్దమా నీ ఖరీదెంత’ నాటిక కళాకారులకు రూ.2లక్షలు, తృతీయ ఉత్తమ ప్రదర్శనగా నిలిచిన ‘రైతేరాజు’ నాటికలోని కళాకారులకు రూ.లక్షతో పాటు దర్శకులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. కార్యక్రమంలో నటులు తనికెళ్ల భరణి, కోట శంకరరావు, గౌతంరాజు, సీఆర్సీ అధ్యక్షుడు తాడి నాగమోహన్రెడ్డి, కార్యదర్శి కర్రి అశోకరెడ్డి, సూర్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-26T01:32:25+05:30 IST