ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పరిహారం కోసం దళిత కుటుంబం ఆందోళన

ABN, First Publish Date - 2023-07-07T04:24:23+05:30

ఎస్సీ, ఎస్టీ, పీఓఏ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటీ) చట్టం ప్రకారం తమకు అందాల్సిన పరిహారం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ దళిత కుటుంబం ఆందోళనకు దిగింది.

అనంతపురం జిల్లా యాడికి తహసీల్దారు కార్యాలయంపైకి ఎక్కిన లక్ష్మన్నతో మాట్లాడుతున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

● తహసీల్దారు కార్యాలయం వద్ద ధర్నా

యాడికి, జూలై 6: ఎస్సీ, ఎస్టీ, పీఓఏ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అట్రాసిటీ) చట్టం ప్రకారం తమకు అందాల్సిన పరిహారం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ దళిత కుటుంబం ఆందోళనకు దిగింది. అనంతపురం జిల్లా యాడికి తహసీల్దారు కార్యాలయం వద్ద బాధితులు విష రసాయనం డబ్బా చేతబట్టుకుని గురువారం ధర్నా చేశారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తహసీల్దారు కార్యాలయంపైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. వారితో చర్చించిన పోలీసులు, రెవెన్యూ అధికారులు.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కోనుప్పలపాడుకు చెందిన రత్నకుమారి, ఓబన్న దంపతుల కుటుంబానికి, అదే గ్రామానికి చెందిన వైసీపీ వర్గీయులకు మధ్య నాలుగేళ్ల కిందట ఘర్షణ జరిగింది. వైసీపీ వర్గీయులు తమపై దాడి చేశారని ఓబన్న దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదయ్యింది. బాధిత కుటుంబానికి ఎస్సీ, ఎస్టీ పీఓఏ చట్టం కింద రూ.2 లక్షలు పరిహారం, జీవనాధారానికి 5 ఎకరాల భూమి ఇస్తున్నట్టు నాటి కలెక్టర్‌, ఎస్పీ ప్రకటించారు. అయితే నాలుగేళ్లు గడిచినా బాధితులకు భూమిని కేటాయించలేదు. పరిహారం సొమ్ములో రూ.1.50 లక్షలు మాత్రమే ఇచ్చారు.


Updated Date - 2023-07-07T04:24:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising