కేజీబీవీల్లో 12న బదిలీ కౌన్సెలింగ్
ABN, First Publish Date - 2023-06-11T01:34:53+05:30
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 20 కేజీబీవీల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి సోమవారం బదిలీ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు (సెంట్రల్), జూన్ 10: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 20 కేజీబీవీల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి సోమవారం బదిలీ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని సమగ్ర శిక్ష ఏపీసీ వెంకటరమణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బదిలీ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ధ్రువీకరణ పత్రాలతో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు జిల్లా ఎస్ఎస్ కార్యాలయంలో జరిగే కౌన్సెలింగ్కు హాజరు కావాలన్నారు. కాగా.. సహిత విద్యా విభాగంలో బదిలీలను సమగ్రశిక్ష అధికారులు గోప్యంగా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
Updated Date - 2023-06-11T01:34:53+05:30 IST