ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tirumala: టోకెన్లు ఉన్నవారే తిరుమలకు రండి!

ABN, First Publish Date - 2023-04-09T03:23:18+05:30

వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో రద్దీ పెరిగిందని, భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

భక్తులకు టీటీడీ విజ్ఞప్తి

సర్వదర్శనానికి 30 గంటలు

కొండపై కొనసాగుతున్న రద్దీ

తిరుమల, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో రద్దీ పెరిగిందని, భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ తెలిపింది. అధిక రద్దీ కారణంగా రూ.300 దర్శన టికెట్లు, ఎస్‌ఎ్‌సడీ, దివ్యదర్శన టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని శనివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. కాగా.. శుక్రవారం ఉదయం నుంచే తిరుమలకు భక్తుల రాక మొదలైంది. ఈ క్రమంలో శనివారం కూడా తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసింది. శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లు, మాడవీధులు, కొబ్బరికాయలు సమర్పించే అఖిలాండం, లడ్డూ వితరణ కేంద్రం, అన్నప్రసాద భవనం, బస్టాండ్‌, యాత్రికుల వసతి సముదాయాలు, రోడ్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్‌ శిలాతోరణం వరకు వ్యాపించింది. వీరికి దాదాపు 30 గంటల దర్శన సమయం పడుతోంది. టైంస్లాట్‌ టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు రెండు నుంచి మూడు గంటల దర్శన సమయం పడుతోంది.

Updated Date - 2023-04-09T03:27:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising