తొండవాడలో చోరీ
ABN, First Publish Date - 2023-04-10T00:42:07+05:30
మండలంలోని తొండవాడకు చెందిన మురళీకృష్ణ శర్మ ఇంట్లో చోరీ జరిగింది. 10 గ్రాముల బంగారు నల్లపూసల దండ, 4 గ్రాముల బంగారు కమ్మలు, రూ.45 వేల నగదు చోరీకి గురైంది.
చంద్రగిరి, ఏప్రిల్ 9: మండలంలోని తొండవాడకు చెందిన మురళీకృష్ణ శర్మ ఇంట్లో చోరీ జరిగింది. 10 గ్రాముల బంగారు నల్లపూసల దండ, 4 గ్రాముల బంగారు కమ్మలు, రూ.45 వేల నగదు చోరీకి గురైంది. బాధితుడి కథనం మేరకు.. మూడు రోజుల క్రితం మురళీకృష్ణ శర్మ నెల్లూరు సమీపంలోని బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో సహా వెళ్లారు. ఆదివారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చారు. తాళాలు పగిలిపోయి ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లోని బంగారు, నగదు కనిపించలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ ఇంటిని పరిశీలించారు. వేలిముద్రల నిపుణులు ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-04-10T00:42:07+05:30 IST