గోల్డెన్ టెంపుల్ గెస్ట్హౌ్సలో సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య
ABN, First Publish Date - 2023-07-21T00:34:36+05:30
గోల్డెన్ టెంపుల్ గెస్ట్హౌ్సలో చిత్తూరుకు చెందిన సచివాలయ ఉద్యోగిని గురువారం ఆత్మహత్య చేసుకున్నారు.
చిత్తూరు, జూలై 20: గోల్డెన్ టెంపుల్ గెస్ట్హౌ్సలో చిత్తూరుకు చెందిన సచివాలయ ఉద్యోగిని గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు నగరం ఎం.జి.ఆర్. వీధిలోని 37వ డివిజన్ సచివాలయ అడ్మిన్ సెక్రటరీగా సాజాలత(37) పనిచేస్తున్నారు. ఈమె గురువారం సాయంత్రం గోల్డెన్ టెంపుల్ గెస్ట్హౌ్సలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. సాయంత్రం చూసేసరికి ఉరేసుకుని చనిపోయినట్లు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఆమె తల్లి మూడు నెలల కిందట అనారోగ్యంతో చనిపోయింది. ఈ నేపథ్యంలో సాజాలత మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-07-21T00:34:36+05:30 IST