ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైసీపీ కౌన్సిలర్ల తిరుగుబాటు!

ABN, First Publish Date - 2023-09-26T01:47:53+05:30

కుప్పంలో అధికార పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. వార్డుల్లో అభివృద్ధి జరగడంలేదంటూ సోమవారం మున్సిపల్‌ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు.

కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న అధికార పార్టీ కౌన్సిలర్లు

కుప్పం,సెప్టెంబరు 25: కుప్పంలో అధికార పార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. వార్డుల్లో అభివృద్ధి జరగడంలేదంటూ సోమవారం మున్సిపల్‌ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. మొత్తం 19 మంది వైసీపీ కౌన్సిలర్లలో ఐదుగురు స్వయంగా.. మరో ఐదుగురి బంధువులు.. ఇలా పది మంది ఆందోళనలో పాల్గొన్నారు. మరికొందరు బహిరంగంగా బయటకు రాకున్నా.. వెనకుండి మద్దతు పలికారు. పట్టణంలో మురుగు నీటి కాలువలు నిర్మిస్తామంటూ వీధులను తవ్వేశారు. నెలలు గడుస్తున్నా చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో ఆగిపోయాయి. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వాళ్లూ చేతులెత్తేశారు. దీంతో ఇలా ఆందోళన తెలిపారు. మున్సిపల్‌ అధికారుల్లో సగానికి పైగా ముఖ్యులైనవారు దూర ప్రాంతాలనుంచి కార్యాలయానికి వారికి ఇష్టమొచ్చినపుడు వచ్చి వెళ్తారని, ఛైర్మన్‌ను అడిగితే తనకు తెలియదని చేతులెత్తేస్తారని అన్నారు. కనీసం మున్సిపల్‌ సమావేశం నిర్వహించి నాలుగు నెలలకు పైగా అవుతోందన్నారు. అందుకే ప్రజలకు పనులు చేయలేని కార్యాలయం ఎందుకని తాళాలు వేశామన్నారు.

Updated Date - 2023-09-26T01:47:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising