ఏనుగు దాడిలో వరి పంట ధ్వంసం
ABN, First Publish Date - 2023-04-22T01:29:50+05:30
పాలేరు రెవెన్యూ తులసికుంట అటవీ సమీపంలో వరి, మామిడి పంటలపై ఏనుగుల గుంపు పడి ధ్వంసం చేశాయి.
బంగారుపాళ్యం, ఏప్రిల్ 21: పాలేరు రెవెన్యూ తులసికుంట అటవీ సమీపంలో వరి, మామిడి పంటలపై ఏనుగుల గుంపు పడి ధ్వంసం చేశాయి. గురువారం రాత్రి 14 ఏనుగుల గుంపు అటవీ ప్రాంతం నుంచి పంట పొలాలపై పడ్డాయి. శేషాపురానికి చెందిన మోహన్ నాయుడికి చెందిన రెండున్నర ఎకరాల వరిపంటను, అదే గ్రామానికి చెందిన నాగభూషణం నాయుడికి చెందిన మామిడి తోటలను ధ్వంసం చేశాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
బంగారుపాళ్యం, ఏప్రిల్ 21: పాలేరు రెవెన్యూ తులసికుంట అటవీ సమీపంలో వరి, మామిడి పంటలపై ఏనుగుల గుంపు పడి ధ్వంసం చేశాయి. గురువారం రాత్రి 14 ఏనుగుల గుంపు అటవీ ప్రాంతం నుంచి పంట పొలాలపై పడ్డాయి. శేషాపురానికి చెందిన మోహన్ నాయుడికి చెందిన రెండున్నర ఎకరాల వరిపంటను, అదే గ్రామానికి చెందిన నాగభూషణం నాయుడికి చెందిన మామిడి తోటలను ధ్వంసం చేశాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - 2023-04-22T01:30:13+05:30 IST