శ్మశానంలో జగనన్న ఇళ్లు వివాదంగా మారిన అంత్యక్రియలు
ABN, First Publish Date - 2023-01-18T00:28:39+05:30
మండలంలోని నంగమంగళం పంచాయతీ గురుగునత్తం దళితవాడలో శ్మశానం పక్కనే జగనన్న ఇళ్ల నిర్మాణానికి స్థలాలు మంజూరు చేశారు. ఇప్పటికే కొంతమంది అక్కడ ఇళ్లు నిర్మించుకున్నారు.
గుడిపాల, జనవరి 17: మండలంలోని నంగమంగళం పంచాయతీ గురుగునత్తం దళితవాడలో శ్మశానం పక్కనే జగనన్న ఇళ్ల నిర్మాణానికి స్థలాలు మంజూరు చేశారు. ఇప్పటికే కొంతమంది అక్కడ ఇళ్లు నిర్మించుకున్నారు. ఈ క్రమంలో కమలమ్మ అనే మహిళ మృతిచెందడంతో అంత్యక్రియలు నిర్వహించేందుకు అక్కడికి తీసుకెళ్లారు. ఇక్కడ అంత్యక్రియలు చేయడానికి వీల్లేదని వారు అడ్డుకున్నారు. కమలమ్మ కుటుంబ సభ్యులు వారితో వాగ్వాదానికి దిగారు. గుడిపాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలతో చర్చించి, అక్కడే అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.
Updated Date - 2023-01-18T00:28:43+05:30 IST