సముద్రతీరంలో భక్తులపై చేపదాడి
ABN, First Publish Date - 2023-09-22T00:59:10+05:30
సముద్రతీరంలో భక్తులపై చేపదాడి చేసిన ఘటన వాకాడు మండలం తూపిలిపాళెంలో గురువారం జరిగింది.
వాకాడు, సెప్టెంబరు 21: సముద్రతీరంలో భక్తులపై చేపదాడి చేసిన ఘటన వాకాడు మండలం తూపిలిపాళెంలో గురువారం జరిగింది. వినాయక విగ్రహాల నిమజ్జనంలో భాగంగా భక్తులు సముద్రపు నీటిలోకి దిగారు. విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా భక్తుల కాళ్లకు ఏదో తగులుతుండడంతో ఒడ్డుకు కొట్టుకొచ్చిన వస్తువులు అనుకుని పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఒక్కసారిగా చేప దాడి చేయడంతో తీరం వైపు పరుగులు తీశారు. ఈ చేప దాడిలో చిట్టమూరు మండలానికి చెందిన 14మంది భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారికి స్థానికంగా ఏర్పాటు చేసి ఉన్న వైద్య శిబిరంలో చికిత్స చేశారు. దాడి చేసింది.. టేకు చేపగా స్థానికులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తూపిలిపాళెంలో ఎన్నడూ లేని విధంగా భక్తులపై చేప దాడి చేయడం కలకలం రేపింది. పోలీసులు శుక్రవారం జరగాల్సిన నిమజ్జన కార్యక్రమాలను మరోచోట నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నారు.
Updated Date - 2023-09-22T00:59:10+05:30 IST