ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్యావతార మూర్తి పాదాలను తాకిన భాస్కరుడి తేజం

ABN, First Publish Date - 2023-03-26T02:16:31+05:30

సూర్యపూజ మహోత్సవాల్లో భాగంగా శనివారం భాస్కరుడి కిరణాలు మత్స్యావతార మూర్తి పాదాలను తాకాయి.

వేదనారాయణుడి పాదాలు తాకిన సూర్యకిరణాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నాగలాపురం, మార్చి 25: సూర్యపూజ మహోత్సవాల్లో భాగంగా శనివారం భాస్కరుడి కిరణాలు మత్స్యావతార మూర్తి పాదాలను తాకాయి.నాగలాపురంలోని శ్రీదేవి, భూదేవి సమేత వేదనారాయణ స్వామి ఆలయం లో శనివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో భాస్కరుడి కిరణాలు ద్వార గోపురం, బలిపీఠం, ధ్వజస్తంభం, రాజ గోపురాలను తాకుతూ వేద సంరక్షకుడి పాదాలను తాకాయి.భక్తుల గోవింద నామస్మరణల నడుమ సూర్యకిరణాలు ప్రవేశించిన మార్గంలో ఆలయ పరిచారకులు పుణ్య జలాన్ని చిలకరించారు. అనంతరం స్వామి, అమ్మవార్లను గోదాదేవి,వేదనారాయణుడి అలంకరణలో తిరుచ్చిపై పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి హారతులు పట్టారు.అనంతరం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు కోలాటాలు భజన బృందాల నడుమ తిరుచ్చిపై తిరువీధి ఉత్సవం సాగింది.

Updated Date - 2023-03-26T02:16:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising