ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గుడిమల్లం ఆలయంలో దర్శన సమయం పెంపు

ABN, First Publish Date - 2023-07-15T00:20:05+05:30

ఏర్పేడు మండలం గుడిమల్లంలో కొలువైన పరశురామేశ్వర స్వామి ఆలయ దర్శన సమయాన్ని పెంపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏర్పేడు, జూలై 14: ఏర్పేడు మండలం గుడిమల్లంలో కొలువైన పరశురామేశ్వర స్వామి ఆలయ దర్శన సమయాన్ని పెంపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ ఆలయంలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే దర్శనం ఉండేది. శనివారం నుంచి 3 గంటలు అదనంగా ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శన సమయం పెంచినట్లు కేంద్ర పురావస్తుశాఖ డీజీ నుంచి ఆదేశాలు అందాయని ఆలయ చైర్మన్‌ నరసింహ యాదవ్‌, ఈవో రామచంద్రారెడ్డి తెలిపారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దర్శన సమయాన్ని పెంచడానికి పురావస్తు శాఖ అధికారులతో మాట్లాడి సహకరించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి, తిరుపతి ఎంపీ గురుమూర్తికి గ్రామస్తులు, పంచాయతీ సర్పంచ్‌ సుబ్రహ్మణ్యంయాదవ్‌, భక్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - 2023-07-15T00:20:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising