ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదలపై జగన్‌కు సవతి తల్లి ప్రేమ: బుద్దా వెంకన్న

ABN, First Publish Date - 2023-06-02T04:44:58+05:30

పేదలపై సీఎం జగన్మోహన్‌రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహారాణిపేట (విశాఖపట్నం), జూన్‌ 1: పేదలపై సీఎం జగన్మోహన్‌రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘జగన్‌కు నిజంగా పేదలపై ప్రేమ ఉంటే విశాఖలోని దసపల్లా, ఎన్‌సీసీ, రేడియంట్‌ భూములను వారికి పంపిణీ చేయాలి. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యారం వద్ద సుమారు 600 ఎకరాల డీ పట్టా భూములను బినామీల పేరుతో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, విజయసాయిరెడ్డి దోచుకుని లే అవుట్లు వేశారు. రికార్డులను తారుమారు చేసి సుమారు 100 ఎకరాలు కబ్జా చేశారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైసీపీ నాయకులు దోచుకున్న ప్రభుత్వ భూములన్నింటినీ పేదలకు పంపిణీ చేస్తాం. కూన రవికుమార్‌ చేతిలో వచ్చే ఎన్నికల్లో శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కచ్చితంగా ఓడిపోతారు. అనంతరం ఆయనకు అంకుశం సినిమా చూపిస్తాం. నేను చంద్రబాబుకు పూర్తి విధేయుడిని. వచ్చే ఎన్నికల్లో విజయవాడ వెస్ట్‌ నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నా. లేకుంటే అధినేత సూచించిన ఎక్కడి నుంచైనా పోటీ చేస్తా’’ అని బుద్దా స్పష్టం చేశారు.

Updated Date - 2023-06-02T04:44:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising