ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీ ప్రజల్లో నిశ్శబ్ద విప్లవం!

ABN, First Publish Date - 2023-06-26T03:54:11+05:30

ఏపీ ప్రజల్లో సైలెంట్‌ రివల్యూషన్‌(నిశ్శబ్ద విప్లవం) ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగన్‌రెడ్డిపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత

వైసీపీ ప్రభుత్వం కూలడం తథ్యం: టీడీపీ నేత యనమల హెచ్చరిక

అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): ‘ఏపీ ప్రజల్లో సైలెంట్‌ రివల్యూషన్‌(నిశ్శబ్ద విప్లవం) ఉంది. సీఎం జగన్‌ పాలనపై రాష్ట్ర ప్రజానీకంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. జగన్‌ను ఇంటికి పంపించాలనేంత కసితో జనం ఉన్న్టారు’ అని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ’నాలుగేళ్లలో ప్రజాధనం పెద్ద ఎత్తున స్వాహా చేశారు. అన్నివర్గాల్లో జగన్‌రెడ్డి బాధితులే. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా జగన్‌ బాధిత వర్గాలే. ఎందరో ప్రాణాలను బలిగొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ రౌడీ మూకలను పెంచిపోషించిన దాఖలా లేదు. జగన్‌ తయారు చేసిన మూకలే జగన్‌పై తిరుగుబాటు చేస్తున్నాయి. విశాఖలో అధికార పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాపే నిదర్శనం. ప్రజా ధనాన్ని సీఎం, వైసీపీ ఎమ్మెల్యేలు దోచేయడం వల్లే ఖజానా ఖాళీ అయింది. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు. వైసీపీ పాలనపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉంది. ప్రజలంతా గుంభనంగా ఉంటూ సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలొస్తాయా? అని కాచుక్కూర్చున్నారు. జగన్‌ కోట పునాదులు కదులున్నాయి. వైసీపీ ప్రభుత్వం కూలడం తథ్యం’ అని యనమల హెచ్చరించారు.

Updated Date - 2023-06-26T03:54:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising