రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం
ABN, First Publish Date - 2023-02-07T00:01:18+05:30
పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ ధరణిబాబు తెలిపారు.
తాడిపత్రి, ఫిబ్రవరి 6: పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ ధరణిబాబు తెలిపారు. పెన్నానది బైసాస్ వద్ద పట్టణంలోని బంకమడివీధికి చెందిన దీక్షిత, గన్నెవారిపల్లి కాలనీలోని జానను అదుపులోకి తీసుకున్నామన్నారు. విచారణలో నంద్యాలకు చెందిన మల్లికార్జునరెడ్డి, బండి ఆత్మకూరులోని గపూర్ నుంచి తరచూ గంజాయిని కొనుగోలు చేసేవారిమని తెలిపారన్నారు. ప్రస్తుతం పట్టణంలోని నంద్యాల రోడ్డులో ఉన్న వారిని కూడా అరెస్ట్ చేశామని చెప్పారు.
Updated Date - 2023-02-07T00:01:20+05:30 IST