నేడు ఎన్టీఆర్ వర్ధంతి
ABN, First Publish Date - 2023-01-18T00:40:55+05:30
టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నివాళులు అర్పించేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు.
జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు
ఎన్టీఆర్ విగ్రహాలకు పార్టీ జెండాలతో అలంకరణ
అనంతపురం అర్బన, జనవరి 17: టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బుధవారం ఘనంగా నివాళులు అర్పించేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ విగ్రహాలను పార్టీ జెండాలతో అలంకరించారు. నగరంలోని లలిత కళాపరిషతలో ఉదయం 11 గంటలకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు జడ్పీ ఆవరణ, 9.30 గంటలకు ఆర్ట్స్ కళాశాల, 10 గంటలకు శిల్పారామంలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పిస్తామని ఆయన తెలిపారు. సాయంత్రం 5 గంటలకు లలిత కళాపరిషతలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
Updated Date - 2023-01-18T00:40:57+05:30 IST