వారు.. నీరు..!
ABN, First Publish Date - 2023-02-02T00:53:49+05:30
అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు ఆ గ్రామ ప్రజలకు నీటి తిప్పలు తెచ్చిపెట్టాయి. వాటర్ ప్లాంట్ మూతబడటంతో 15 రోజులుగా వంకలో చెలిమి నీటిని తెచ్చుకుని తాగుతున్నారు.
అధికార పార్టీ నాయకుల మధ్య విభేదాలు ఆ గ్రామ ప్రజలకు నీటి తిప్పలు తెచ్చిపెట్టాయి. వాటర్ ప్లాంట్ మూతబడటంతో 15 రోజులుగా వంకలో చెలిమి నీటిని తెచ్చుకుని తాగుతున్నారు. కనగానపల్లి మండలం కేఎన పాళ్యంలో అధికార పార్టీ నాయకుల మధ్య ఇంటి బిల్లుల విషయంలో విభేదాలు వచ్చాయి. వాటర్ ప్లాంట్ నిర్వాహకుడికి ఇంటి బిల్లు మంజూరు చేయకపోవడంతో వివాదం రాజుకుంది. ఈ కారణంగా ప్లాంట్ను మూసేశాడు. అప్పటి నుంచి గ్రామస్థులు చెలిమి నీటిని తెచ్చుకుంటున్నారు. ప్లాంట్కు మరమ్మతులు చేయాల్సి ఉందని, అందుకే మూతబడిందని పంచాయతీ కార్యదర్శి చిట్టెమ్మ అన్నారు. మరమ్మతు చేయించామని, గురువారం నుంచి ప్రజలకు శుద్ధ జలాలను అందిస్తామని తెలిపారు.
- కనగానపల్లి
చెలిమి నీటిని తెచ్చుకుంటున్న గ్రామస్థులు
Updated Date - 2023-02-02T00:53:53+05:30 IST