ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జగనన్న ఇళ్లకు రూ.5 లక్షలు ఇవ్వాలి’

ABN, First Publish Date - 2023-01-19T00:25:06+05:30

రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు రూ. 5 లక్షలు చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం విద్య, జనవరి 18: రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు రూ. 5 లక్షలు చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ డిమాండ్‌ చేశారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు, జగనన్న లేఔట్‌ ఇళ్ల లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై లబ్ధిదారులతో బుధవారం అర్జీలు స్వీకరించారు. 10వ డివిజనలో నగర సమితి ఆధ్వర్యంలో జాఫర్‌, నగర కార్యదర్శి శ్రీరాములు ఇతర నాయకులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జాఫర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు ఇచ్చే రూ. 1.80 లక్షలు ఏపాటికీ సరిపోవడం లేదన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 5 లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య, రమణయ్య, నగర సహాయ కార్యదర్శి అల్లీపీరా, కార్యవర్గసభ్యులు బంగారు బాషా, ఎల్లుట్ల నారాయణస్వామి, మున్నా, చాంద్‌ బాషా పాల్గొన్నారు.

Updated Date - 2023-01-19T00:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising